తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణనలో భాగంగా భద్రాచలంలో నివసిస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇంటికి సర్వే సిబ్బంది చేరుకొని కుటుంబ సమగ్ర వివరాలు సేకరించారు. సిబ్బంది అడిగిన వివరాలు ఎమ్మెల్యే చెప్పి వారికి సహకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ,నియోజకవర్గ ప్రజలంతా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వేకి సహకరించాలని కోరారు










