వనవాసీకి వాటర్ ట్యాంకు వితరణ

గ్రామీణ వైద్యురాలు సుధారాణి తన తల్లి స్వర్గీయ కాండ్రాకోట శేషమాంబ జ్ఞాపకార్థం వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యాలయానికి సుమారు రూ 6 వేల విలువైన 1000 లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకు వితరణగా ఇచ్చారు. శుక్రవారం దాన్ని నిలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతలు గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసి విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శేషమాంబ మనవడు రాజేష్ వనవాసి ప్రాంత మహిళ సహ కార్యదర్శి పెద్దాడ ఆశాలత, కోరం సూర్యనారాయణ, జవ్వాది మురళీకృష్ణ వేములపల్లి ప్రవీణ్ కుమార్, రామలక్ష్మణ్, గొంది ప్రసన్న, శ్రావణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS