గిరిజనులు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా గిరిజన దర్బార్లో పిర్యాదు చేయాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. ప్రతీ సోమవారం ఉదయం 10.30 గంటలకు గిరిజన దర్బార్ ప్రారంభమౌతుందని తెలిపారు. భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.










