భద్రాద్రి దేవస్థానం హుండీ ఆదాయం రూ 1.03 కోట్లు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.1,03,21,415 ఆదాయం భక్తుల నుండి వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ.రమాదేవి తెలిపారు.90 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి హుండీలో భక్తులు సమర్పించుకున్నారని తెలిపారు.










